Post by Lopintisri on Jul 22, 2014 7:53:02 GMT 5.5
రుంజ
రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కళింగాంధ్రలో, కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు ఉపయోగిస్తారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చు.
రుంజలు
తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత(కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు,జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు. విశ్వ బ్రాహ్మణుల గోత్రాలను , వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.
రుంజ వాయిద్య కళాకారులను రుంజ వారని పిలవడం సర్వసాధారణం. మను, మయ, త్వష్ఠ, శిల్పి, విశ్వజ్ఞ... సమాహారమే విశ్వకర్మ. వీరిని విశ్వబ్రాహ్మణులు అని కూడా అంటారు. కనుక వీరు ఈ విశ్వబ్రాహ్మణులయిన కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారుల దగ్గరే రుంజా వాయించాలని నియమం ఉన్నది, ఇది పూర్వీకుల నండి వారసత్వ సంపదగా వస్తుంది, రుంజలు ఆశ్రీత కులాలలో ఒకటిగా గుర్తింపుకు నోచుకున్నరు అయితే వీరు కూడా విశ్వబ్రాహ్మణ కులస్తులే అయితే వీరు వలసలు.. ఈ నేపథ్యంలో వీరు గ్రామ గ్రామానా తిరిగి విశ్వబ్రాహ్మణులకు తమ కళారూపాలను ప్రదర్శించేవారు. రుంజలు భౌతికవాదులు. పాంచభౌతిక శరీరం గురించి, పంచ భూతాల విధుల గురించి వారు వివరిస్తారు. ఒక పదాన్ని చదువుతూ దాన్ని రుంజపై పలికిస్తారు. ఢమరుకం, మృదంగం వంటి అనేక వాద్యాలను దీనిపై వినిపిస్తారు.
ఈ నేపథ్యంలో తమ రుంజల ధ్వనిని గ్రామస్తులను వినిపించే ప్రయత్నం చేస్తారు. అది కూడా సాదాసీదాగా కాదు... తారాస్థాయికి చేరేవిధంగా వాయించి వినిపిస్తారు. ఇక ఆ రాత్రికి అక్కడి వారికి వినోదమే. గ్రామంలో విశ్వబ్రాహ్మణుల కోసం వీరు ప్రదర్శన ఏర్పాటు చేసినా గ్రామస్తులు కూడా వచ్చిచూసి వినోదం పంచుకు నేవారు తక్కు ధిక్కు... తకధిక్కు ధిక్కు... తకమని... అంబుజా సనుడు తాళంబువేయ... అంటూ మెల్లగా ప్రారంభమైన గానం క్రమంగా ఊపందుకుంటుంది. ఈ గానంలో వేగం, తాళంలో తీవ్రతను పెంచుకుంటూ... రుంజు ధ్వని తీవ్రతను పెంచుతూ కథలు చెపుతారు రుంజవారు. వీరి కథలకు అప్పట్లో మన రాష్ర్టంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరిదగ్గర ఉన్న రుంజలను వాయిస్తూ కథలు చెప్పి తమ కళను ప్రదర్శించి మెప్పునుపొందుతారు. వీరు విశ్వకర్మ బ్రాహ్మణ వంశాగమనం, విశ్వగుణ దర్శనం, దేవబ్రాహ్మణ మహత్యం, దక్షయజ్ఞం, వీరభద్ర విజయం... తదితర కథలు చెప్పేవారు. విశ్వబ్రాహ్మణులు లేకపోతే ప్రపంచమే లేదని వారిని ఆకాశాని కెత్తేవారు. విశ్వబ్రాహ్మణుల కృషిని, వారు చేసే పంచ వృత్తులు, జీవన శైలిలో వారి పాత్రలు, వారు చేస్తునటువంటి ఎన్నో మంచిపనులు, ప్రపంచములో వీరి స్ధానం మరియు ఉపయోగము గురించి వేనోళ్ళ కీర్తిస్తారు. రుంజపై అద్భుతమైన ధ్వనులు వినిపించి అక్కడి వారికి వినోదం కల్పించేవారు. వీరి కళారూప ప్రదర్శన మొత్తం వివిధ రకాల ధ్వనులతోపాటు శ్లోకాలు, పాటలు, విన్యాసాలతో మైమరపించేది. ఇక సంగీత శాస్త్రానికి సంబంధించి సప్తతాళాల్ని ముపైరెండు రకాల రాగాలను వారి ప్రదర్శనలో ప్రదర్శించేవారు. వీరి కథలన్నీ సంసృత శ్లోకమయమైన తాళపత్ర గ్రంథాలలో ఉండేవి. వీరి కళారూపాలను విశ్వబ్రాహ్మణులు ఆదరించడంతోపాటు వీరికి డబ్బు, ధాన్యం ఇచ్చి సాగనంపేవారు. వీరి కళారూపాలను ప్రదర్శించడానికి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ప్రయాణమయ్యేవారు. ఈ క్రమంలో కుటుంబం మొత్తం ఇదే వృత్తిపై వించడంతో సంచార జీవనం గడిపేవారు. పెద్ద పెద్ద రుంజలతోపాటు వంట, ఇంటి సామాను తీసుకువెళ్లడానికి వీరు ఎడ్లబండ్లను ఉపయోగించేవారు. ఇక వీరి పిల్లలకు చిన్నతనం నుంచీ ఈ విద్యను నేర్పించేవారు. చదువు చెప్పించినా చెప్పించ కపోయినా ఈ విద్యకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా వీరి సాధనలో మాత్రం మార్పు ఉండేదికాదు. రుంజ వాయిద్యాలతో పాటు... గానం, కథలతో వీరు క్షణం తీరికలేకుండా ఉండేవారు. పద్యాలు, శ్లోకాలు, తాళవాయిద్యగతులను కూడా వీరికి నేర్పించేవారు.
వీరు ఈ కళారూపాన్నే కులవృత్తిగా ఎంచుకోవడంతో పిల్లలకు కచ్చింగా వీటిని నేర్పించేవారు.
రుంజా విశిష్ఠత
రౌంజకాసురుణ్ణి వధించి అతని తోలుతో చేసిన రుంజ వాద్యం, రుంజ అనే వాయిద్యాన్ని రౌంజ అని కూడా అంటారు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాని నిలబెట్టి వాయిస్తారు. ఇత్తడితో తయారు చేసిన ఈ రుంజ పై భాగంలో తోలును అమర్చుతారు. ఆ తోలును తాళ్లతోలాగి గట్టిగా బిగించడంతో ఇది ఒక ధ్వని వాయిద్యం అవుతుంది. ఈ వాయిద్యాన్ని గట్టి కర్రపుల్లలతో వాయింస్తారు. ఈ రుంజల నుండి వచ్చే ధ్వని యుద్ధ భేరీ నాదాలను మరిపిస్తాయి. ఈ వాయిద్యాన్ని వాయించే సమయంలో రుంజవారు తమ శక్తినంతా చేతుల్లోకి కూడదీసుకుని వాయించడంతో దిక్కులుపిక్కటిల్లేవి. రుంజా వాయించేది ముఖ్యముగా సప్తస్వరాలలో భయానక, వీరత్వ శబ్దాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో శబ్దంలో ఒక్కో పదం ఇమిడి ఉంటుంది. అత్యద్భుత ప్రదర్శనా విన్యాసం కూడా ఇందులో భాగమే. జానపద చర్మవాద్యాలలో ‘రుంజ’ ఒక సైనిక కవాతు. మార్చింగ్ తర్జు. వీరత్వ ప్రకటన.
రుంజ కథా గానం
విశ్వ బ్రాహ్మణ కులాలను ఆశ్రయించేవారు రుంజలు, రుంజ కథకులు గ్రామానిని వెళ్ళీనపుడు ఊరిలో పెద్ద ఆచారి అంటే మను బ్రహ్మ సంతతి వారు ఇంటికి వెళ్ళీ లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి కథ చెబుతాడు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం, కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. ఉంజ కథకుడు కథను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం,బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రితులైన రుంజలకు, దాతలైన విశ్వబ్రాహ్మణులము మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోంది.
ఉత్తరాంధ్రలో రుంజ కళాకారులు
శ్రీకాకుళం జిల్లా లోని అంపోలు , మామిడివలస , ఆడవరం గ్రామాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మొన్నటివరకు 20 మంది కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ కళను విడిచిపెట్టు యితర వృత్తులలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతానికి 6 గురు కళాకారులు ఉన్నట్లు అంచనా. ఇటీవల వీరు శ్రీకాకుళం జిల్లా కలెక్టరు ఎదుట ప్రదర్శనలు యిచ్చి ప్రశంశలు పొందారు. వీరిలో (1) విభూది కృష్ణమూర్తి (2) శాంతం కామరాజు (3) విడియాల ధర్మారావు (4) పొందూరు రాఘవయ్య లు ముఖ్యులు. వీరు రుంజ వాయిద్యం పట్టుకున్నప్పుడే వీరిని రుంజలు అంటారు. కాని కులం రీత్యా వీరు బేడ జంగాల కులానికి చెందినవారు. పనసలు, కోమటి పనసలు కృష్ణా జిల్లా , గుంటూరు జిల్లా, తెలంగాణా జిల్లాలలో ఉన్నారు. ఈ రుంజ కళాకారులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లలో విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్తారు. ఎక్కడకు వెళ్ళీనా ఒక సంస్కృత శ్లోకం చదివి తెలుగులో కథ చెబుతారు. సాధారణంగా ముగ్గురు ఉంటారు. ఒకరు కథ చెబితే , ఒకరు వాయిద్యం వాయిస్తే ఇంకొకరు వంతగా ఉంటారు. సర్కారాంధ్ర దేశంలో తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ పాశం పాలలోచనుడు, జీడి కంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రుంజవాయిద్యం
రౌంజ కాసురుడనే రాక్షసుడను సంహరించి వాడి శరీర భాగాలతో చేసిన వాయిద్యం కావున దీనిని రుంజం అనే పేరు వచ్చింది. రుంజ వాయించేవారు రుంజకళాకారులు.
ఈ వాయిద్యాన్ని బలమైన కర్రపుల్లలతో వాయిస్తారు. రుంజను ఏటవాలుగా ముందుకు వంచి కదలకుండా మోకాలతో అదిమిపెట్టి, చెతులతో త్రాళ్ళను లాగి శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ మీద వీరణం, డప్పువాయిద్యం, తాషా,సప్తతాళాలు వాయిస్తారు.
రౌంజుకాసురుడు
ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినది చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పర్వతీ దేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వ కర్మ రౌంజ కాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరింప బడింది.
రుంజ కథ ఓంకారంతో, అంబాస్తుతితో ప్రారంభమవుతుంది. తరువాత దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం మొదలగు కథలు చెప్పి పారితోషకం తీసుకొని దీవెనలు యిస్తారు.
ప్రస్తుత రుంజలు
కళింగాంధ్రలో, కోస్తా జిల్లాలలో ఒకే ఊరిలో నలుగురు రుంజ కళాకారులున్నరు వారు శ్రీకాకుళం జిల్లా, గార మండలము, అంపోలు గ్రామస్తులు అయినటువంటి విభూది కృష్ణమూర్తిగారు, విభూది గౌరీశంఖర్ గారు, విభూది అన్నపూర్నయ్య గారు, సంత కామేశ్వరరావు గారు, రూంజా వాయిద్యకారులు. ప్రతీ విశ్వబ్రాహ్మణుల ఇంటిలో ఏటా ఏదోఒకరోజున ఈ వాయిద్యన్ని వాయిస్తారు, రుంజవారి గానం రుంజా ధ్వని ని వింటే సకల పాపాలు, రోగాలు పోతాయని ప్రతీతి, అదే రోజున విశ్వబ్రాహ్మణుల ఇంట భుజించి మరి వేరొక విశ్వబ్రాహ్మణుని ఇంటికి బయలుదేరుతారు.
రుంజలు చెప్పే కథలు
రుంజలు విశ్వకర్మ పుట్టుక,పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతారు. విశ్వబ్రాహ్మణుల లోని సానగ(కమ్మరాచారి) , సనాతన (వడ్రపుపని) , అభవనస(కంచరపుపని) , ప్రత్నన(శిల్పాచారి), సువర్ణస(బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇంటికి వెళ్తారు.
ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. విశ్వ బ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి వారికి ధన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు, వారి వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింప చేస్తారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ వారి ప్రదర్శనాల్లో ప్రదర్శిస్తారు. ముఖ్యమైనవి. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భావము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య శ్రావ్వమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపాలలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదారవిదములకూ అనే పారంపర్యంగా వచ్చే మంఘళ హారతినే వీరూ అనుకరిస్తారు.
మంగళం
ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోక మీసా లోకమనియా
లాకులేక కోక కరుణాతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ||ఓం||
పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................||ఓం||
ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రితి లేదని నిలిచి కొలిచిన......................||ఓం||
రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ వుంది.
అంబా స్తుతి
కాంభోజి రాగం.
కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం
అంబుజాక్షీవేలా................................||అంబా||
ముజ్జగము లేలేటి
మోక్షదాయీ మహమ్మాయీ
సజ్జన రక్షాగాల్
గజ్జలు ఘల్మనంగ.....................||అంబా నీవిందు రావే||
అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మరించి తరువాత చేతులతో ఒక తాళాన్ని వాయిస్తారు. ఆ తరువాత పంచ ముఖోద్భవ బ్రహ్మలనూ, వారి వారి విధులనూ, శ్రోతలకు వివరిస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వ కర్మ రక్షిస్తున్నాడఆంటూ సకల విశ్వం యొక్క కర్తవ్వాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు.... అలాగే..................
ఇండ్లు కట్టేదెట్లో ... పెండ్లి చేయుట యెట్లో
కృషి యెట్లో శకటాద్రి క్రీడ లెట్లో
కూప ఖననం బెట్లో... ఘోర సార్జన మెట్లో
పాకఆంబు లెట్లో.... జలోపాత్ర లెట్లో
దేవతార్చన లెట్లో... దేవాలయము లెట్లో
భారకు నగలెట్లో ... పండమంచము లెట్లో
మంగళసూత్రము ... మద్దెలెట్లో
నిజము మాచేతి ... పనులనన్నిటిని లెస్స
వివరముగ లెక్క పెట్టగ య్వరి తరము
తెలివి గలిగి కృతజ్ఞలైన తెలియవలయు
శాశ్వత పదాభిలేశ... విశ్వ ప్రకాశ
అంటూ, ఈ పదంలో పంచముఖ బ్రహ్మలొనర్చే అనేకమైన పనులను వివరిస్తూ వీరు లేక పోతే జగత్తు జరగదనీ వివరిస్తూ వుంది. పద్యాలనూ, శ్లోకాలనూ, తాళ వాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి పిల్లలకు నేర్పుతారు. అంతే గాక వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో భక్తి భావంతో వారు నేర్చుకుంటారు. వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ క్రింది ఉదాహరణ చూస్తే మనకు అర్థమౌతుంది.
1.తక్కు ధిక్కు , ధిక్కు తకథిక్కు తకయని
అంబుజాసనుడు తాళంబు వేయ
అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలలలో తాళం వేస్తారు.
2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదఆంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ల్ఘాతవేసి
తాళము చూపును మృధంగ ధ్వన్యను కరణ చేయును.
3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట
అని తాళము చూపును.
4. కకుందకు ధరికిట తుతుందక ల్యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు
శ్లోకం||
చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.
ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగ జేస్తారు. అవే కాక నాద బ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంగికా స్వాన్ని సమిష్టిగా రాగ యుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు
ఈ కళ వీరితోనే అంతరించిపోతున్నది. వీరి పిల్లలు ఎవ్వరూ ఈ కళను నేర్వడంలేదు. వీరికి ఇంతవరకూ ప్రభుత్వం గుర్తింపుకానీ, నివాస గృహాలు గానీ లేవు. కళాకారులకిచ్చే పించన్లు కూడా లేవు. ఈ కళాకారులను ప్రోత్సహించి ఈ కళను గ్రంథస్తం చేయవలసి యున్నది.
రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కళింగాంధ్రలో, కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు ఉపయోగిస్తారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చు.
రుంజలు
తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత(కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు,జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు. విశ్వ బ్రాహ్మణుల గోత్రాలను , వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.
రుంజ వాయిద్య కళాకారులను రుంజ వారని పిలవడం సర్వసాధారణం. మను, మయ, త్వష్ఠ, శిల్పి, విశ్వజ్ఞ... సమాహారమే విశ్వకర్మ. వీరిని విశ్వబ్రాహ్మణులు అని కూడా అంటారు. కనుక వీరు ఈ విశ్వబ్రాహ్మణులయిన కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారుల దగ్గరే రుంజా వాయించాలని నియమం ఉన్నది, ఇది పూర్వీకుల నండి వారసత్వ సంపదగా వస్తుంది, రుంజలు ఆశ్రీత కులాలలో ఒకటిగా గుర్తింపుకు నోచుకున్నరు అయితే వీరు కూడా విశ్వబ్రాహ్మణ కులస్తులే అయితే వీరు వలసలు.. ఈ నేపథ్యంలో వీరు గ్రామ గ్రామానా తిరిగి విశ్వబ్రాహ్మణులకు తమ కళారూపాలను ప్రదర్శించేవారు. రుంజలు భౌతికవాదులు. పాంచభౌతిక శరీరం గురించి, పంచ భూతాల విధుల గురించి వారు వివరిస్తారు. ఒక పదాన్ని చదువుతూ దాన్ని రుంజపై పలికిస్తారు. ఢమరుకం, మృదంగం వంటి అనేక వాద్యాలను దీనిపై వినిపిస్తారు.
ఈ నేపథ్యంలో తమ రుంజల ధ్వనిని గ్రామస్తులను వినిపించే ప్రయత్నం చేస్తారు. అది కూడా సాదాసీదాగా కాదు... తారాస్థాయికి చేరేవిధంగా వాయించి వినిపిస్తారు. ఇక ఆ రాత్రికి అక్కడి వారికి వినోదమే. గ్రామంలో విశ్వబ్రాహ్మణుల కోసం వీరు ప్రదర్శన ఏర్పాటు చేసినా గ్రామస్తులు కూడా వచ్చిచూసి వినోదం పంచుకు నేవారు తక్కు ధిక్కు... తకధిక్కు ధిక్కు... తకమని... అంబుజా సనుడు తాళంబువేయ... అంటూ మెల్లగా ప్రారంభమైన గానం క్రమంగా ఊపందుకుంటుంది. ఈ గానంలో వేగం, తాళంలో తీవ్రతను పెంచుకుంటూ... రుంజు ధ్వని తీవ్రతను పెంచుతూ కథలు చెపుతారు రుంజవారు. వీరి కథలకు అప్పట్లో మన రాష్ర్టంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరిదగ్గర ఉన్న రుంజలను వాయిస్తూ కథలు చెప్పి తమ కళను ప్రదర్శించి మెప్పునుపొందుతారు. వీరు విశ్వకర్మ బ్రాహ్మణ వంశాగమనం, విశ్వగుణ దర్శనం, దేవబ్రాహ్మణ మహత్యం, దక్షయజ్ఞం, వీరభద్ర విజయం... తదితర కథలు చెప్పేవారు. విశ్వబ్రాహ్మణులు లేకపోతే ప్రపంచమే లేదని వారిని ఆకాశాని కెత్తేవారు. విశ్వబ్రాహ్మణుల కృషిని, వారు చేసే పంచ వృత్తులు, జీవన శైలిలో వారి పాత్రలు, వారు చేస్తునటువంటి ఎన్నో మంచిపనులు, ప్రపంచములో వీరి స్ధానం మరియు ఉపయోగము గురించి వేనోళ్ళ కీర్తిస్తారు. రుంజపై అద్భుతమైన ధ్వనులు వినిపించి అక్కడి వారికి వినోదం కల్పించేవారు. వీరి కళారూప ప్రదర్శన మొత్తం వివిధ రకాల ధ్వనులతోపాటు శ్లోకాలు, పాటలు, విన్యాసాలతో మైమరపించేది. ఇక సంగీత శాస్త్రానికి సంబంధించి సప్తతాళాల్ని ముపైరెండు రకాల రాగాలను వారి ప్రదర్శనలో ప్రదర్శించేవారు. వీరి కథలన్నీ సంసృత శ్లోకమయమైన తాళపత్ర గ్రంథాలలో ఉండేవి. వీరి కళారూపాలను విశ్వబ్రాహ్మణులు ఆదరించడంతోపాటు వీరికి డబ్బు, ధాన్యం ఇచ్చి సాగనంపేవారు. వీరి కళారూపాలను ప్రదర్శించడానికి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ప్రయాణమయ్యేవారు. ఈ క్రమంలో కుటుంబం మొత్తం ఇదే వృత్తిపై వించడంతో సంచార జీవనం గడిపేవారు. పెద్ద పెద్ద రుంజలతోపాటు వంట, ఇంటి సామాను తీసుకువెళ్లడానికి వీరు ఎడ్లబండ్లను ఉపయోగించేవారు. ఇక వీరి పిల్లలకు చిన్నతనం నుంచీ ఈ విద్యను నేర్పించేవారు. చదువు చెప్పించినా చెప్పించ కపోయినా ఈ విద్యకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా వీరి సాధనలో మాత్రం మార్పు ఉండేదికాదు. రుంజ వాయిద్యాలతో పాటు... గానం, కథలతో వీరు క్షణం తీరికలేకుండా ఉండేవారు. పద్యాలు, శ్లోకాలు, తాళవాయిద్యగతులను కూడా వీరికి నేర్పించేవారు.
వీరు ఈ కళారూపాన్నే కులవృత్తిగా ఎంచుకోవడంతో పిల్లలకు కచ్చింగా వీటిని నేర్పించేవారు.
రుంజా విశిష్ఠత
రౌంజకాసురుణ్ణి వధించి అతని తోలుతో చేసిన రుంజ వాద్యం, రుంజ అనే వాయిద్యాన్ని రౌంజ అని కూడా అంటారు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాని నిలబెట్టి వాయిస్తారు. ఇత్తడితో తయారు చేసిన ఈ రుంజ పై భాగంలో తోలును అమర్చుతారు. ఆ తోలును తాళ్లతోలాగి గట్టిగా బిగించడంతో ఇది ఒక ధ్వని వాయిద్యం అవుతుంది. ఈ వాయిద్యాన్ని గట్టి కర్రపుల్లలతో వాయింస్తారు. ఈ రుంజల నుండి వచ్చే ధ్వని యుద్ధ భేరీ నాదాలను మరిపిస్తాయి. ఈ వాయిద్యాన్ని వాయించే సమయంలో రుంజవారు తమ శక్తినంతా చేతుల్లోకి కూడదీసుకుని వాయించడంతో దిక్కులుపిక్కటిల్లేవి. రుంజా వాయించేది ముఖ్యముగా సప్తస్వరాలలో భయానక, వీరత్వ శబ్దాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో శబ్దంలో ఒక్కో పదం ఇమిడి ఉంటుంది. అత్యద్భుత ప్రదర్శనా విన్యాసం కూడా ఇందులో భాగమే. జానపద చర్మవాద్యాలలో ‘రుంజ’ ఒక సైనిక కవాతు. మార్చింగ్ తర్జు. వీరత్వ ప్రకటన.
రుంజ కథా గానం
విశ్వ బ్రాహ్మణ కులాలను ఆశ్రయించేవారు రుంజలు, రుంజ కథకులు గ్రామానిని వెళ్ళీనపుడు ఊరిలో పెద్ద ఆచారి అంటే మను బ్రహ్మ సంతతి వారు ఇంటికి వెళ్ళీ లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి కథ చెబుతాడు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం, కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. ఉంజ కథకుడు కథను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం,బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రితులైన రుంజలకు, దాతలైన విశ్వబ్రాహ్మణులము మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోంది.
ఉత్తరాంధ్రలో రుంజ కళాకారులు
శ్రీకాకుళం జిల్లా లోని అంపోలు , మామిడివలస , ఆడవరం గ్రామాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మొన్నటివరకు 20 మంది కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ కళను విడిచిపెట్టు యితర వృత్తులలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతానికి 6 గురు కళాకారులు ఉన్నట్లు అంచనా. ఇటీవల వీరు శ్రీకాకుళం జిల్లా కలెక్టరు ఎదుట ప్రదర్శనలు యిచ్చి ప్రశంశలు పొందారు. వీరిలో (1) విభూది కృష్ణమూర్తి (2) శాంతం కామరాజు (3) విడియాల ధర్మారావు (4) పొందూరు రాఘవయ్య లు ముఖ్యులు. వీరు రుంజ వాయిద్యం పట్టుకున్నప్పుడే వీరిని రుంజలు అంటారు. కాని కులం రీత్యా వీరు బేడ జంగాల కులానికి చెందినవారు. పనసలు, కోమటి పనసలు కృష్ణా జిల్లా , గుంటూరు జిల్లా, తెలంగాణా జిల్లాలలో ఉన్నారు. ఈ రుంజ కళాకారులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లలో విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్తారు. ఎక్కడకు వెళ్ళీనా ఒక సంస్కృత శ్లోకం చదివి తెలుగులో కథ చెబుతారు. సాధారణంగా ముగ్గురు ఉంటారు. ఒకరు కథ చెబితే , ఒకరు వాయిద్యం వాయిస్తే ఇంకొకరు వంతగా ఉంటారు. సర్కారాంధ్ర దేశంలో తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ పాశం పాలలోచనుడు, జీడి కంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రుంజవాయిద్యం
రౌంజ కాసురుడనే రాక్షసుడను సంహరించి వాడి శరీర భాగాలతో చేసిన వాయిద్యం కావున దీనిని రుంజం అనే పేరు వచ్చింది. రుంజ వాయించేవారు రుంజకళాకారులు.
ఈ వాయిద్యాన్ని బలమైన కర్రపుల్లలతో వాయిస్తారు. రుంజను ఏటవాలుగా ముందుకు వంచి కదలకుండా మోకాలతో అదిమిపెట్టి, చెతులతో త్రాళ్ళను లాగి శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ మీద వీరణం, డప్పువాయిద్యం, తాషా,సప్తతాళాలు వాయిస్తారు.
రౌంజుకాసురుడు
ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినది చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పర్వతీ దేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వ కర్మ రౌంజ కాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరింప బడింది.
రుంజ కథ ఓంకారంతో, అంబాస్తుతితో ప్రారంభమవుతుంది. తరువాత దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం మొదలగు కథలు చెప్పి పారితోషకం తీసుకొని దీవెనలు యిస్తారు.
ప్రస్తుత రుంజలు
కళింగాంధ్రలో, కోస్తా జిల్లాలలో ఒకే ఊరిలో నలుగురు రుంజ కళాకారులున్నరు వారు శ్రీకాకుళం జిల్లా, గార మండలము, అంపోలు గ్రామస్తులు అయినటువంటి విభూది కృష్ణమూర్తిగారు, విభూది గౌరీశంఖర్ గారు, విభూది అన్నపూర్నయ్య గారు, సంత కామేశ్వరరావు గారు, రూంజా వాయిద్యకారులు. ప్రతీ విశ్వబ్రాహ్మణుల ఇంటిలో ఏటా ఏదోఒకరోజున ఈ వాయిద్యన్ని వాయిస్తారు, రుంజవారి గానం రుంజా ధ్వని ని వింటే సకల పాపాలు, రోగాలు పోతాయని ప్రతీతి, అదే రోజున విశ్వబ్రాహ్మణుల ఇంట భుజించి మరి వేరొక విశ్వబ్రాహ్మణుని ఇంటికి బయలుదేరుతారు.
రుంజలు చెప్పే కథలు
రుంజలు విశ్వకర్మ పుట్టుక,పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతారు. విశ్వబ్రాహ్మణుల లోని సానగ(కమ్మరాచారి) , సనాతన (వడ్రపుపని) , అభవనస(కంచరపుపని) , ప్రత్నన(శిల్పాచారి), సువర్ణస(బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇంటికి వెళ్తారు.
ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. విశ్వ బ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి వారికి ధన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు, వారి వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింప చేస్తారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ వారి ప్రదర్శనాల్లో ప్రదర్శిస్తారు. ముఖ్యమైనవి. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భావము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య శ్రావ్వమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపాలలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదారవిదములకూ అనే పారంపర్యంగా వచ్చే మంఘళ హారతినే వీరూ అనుకరిస్తారు.
మంగళం
ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోక మీసా లోకమనియా
లాకులేక కోక కరుణాతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ||ఓం||
పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................||ఓం||
ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రితి లేదని నిలిచి కొలిచిన......................||ఓం||
రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ వుంది.
అంబా స్తుతి
కాంభోజి రాగం.
కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం
అంబుజాక్షీవేలా................................||అంబా||
ముజ్జగము లేలేటి
మోక్షదాయీ మహమ్మాయీ
సజ్జన రక్షాగాల్
గజ్జలు ఘల్మనంగ.....................||అంబా నీవిందు రావే||
అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మరించి తరువాత చేతులతో ఒక తాళాన్ని వాయిస్తారు. ఆ తరువాత పంచ ముఖోద్భవ బ్రహ్మలనూ, వారి వారి విధులనూ, శ్రోతలకు వివరిస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వ కర్మ రక్షిస్తున్నాడఆంటూ సకల విశ్వం యొక్క కర్తవ్వాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు.... అలాగే..................
ఇండ్లు కట్టేదెట్లో ... పెండ్లి చేయుట యెట్లో
కృషి యెట్లో శకటాద్రి క్రీడ లెట్లో
కూప ఖననం బెట్లో... ఘోర సార్జన మెట్లో
పాకఆంబు లెట్లో.... జలోపాత్ర లెట్లో
దేవతార్చన లెట్లో... దేవాలయము లెట్లో
భారకు నగలెట్లో ... పండమంచము లెట్లో
మంగళసూత్రము ... మద్దెలెట్లో
నిజము మాచేతి ... పనులనన్నిటిని లెస్స
వివరముగ లెక్క పెట్టగ య్వరి తరము
తెలివి గలిగి కృతజ్ఞలైన తెలియవలయు
శాశ్వత పదాభిలేశ... విశ్వ ప్రకాశ
అంటూ, ఈ పదంలో పంచముఖ బ్రహ్మలొనర్చే అనేకమైన పనులను వివరిస్తూ వీరు లేక పోతే జగత్తు జరగదనీ వివరిస్తూ వుంది. పద్యాలనూ, శ్లోకాలనూ, తాళ వాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి పిల్లలకు నేర్పుతారు. అంతే గాక వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో భక్తి భావంతో వారు నేర్చుకుంటారు. వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ క్రింది ఉదాహరణ చూస్తే మనకు అర్థమౌతుంది.
1.తక్కు ధిక్కు , ధిక్కు తకథిక్కు తకయని
అంబుజాసనుడు తాళంబు వేయ
అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలలలో తాళం వేస్తారు.
2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదఆంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ల్ఘాతవేసి
తాళము చూపును మృధంగ ధ్వన్యను కరణ చేయును.
3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట
అని తాళము చూపును.
4. కకుందకు ధరికిట తుతుందక ల్యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు
శ్లోకం||
చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.
ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగ జేస్తారు. అవే కాక నాద బ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంగికా స్వాన్ని సమిష్టిగా రాగ యుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు
ఈ కళ వీరితోనే అంతరించిపోతున్నది. వీరి పిల్లలు ఎవ్వరూ ఈ కళను నేర్వడంలేదు. వీరికి ఇంతవరకూ ప్రభుత్వం గుర్తింపుకానీ, నివాస గృహాలు గానీ లేవు. కళాకారులకిచ్చే పించన్లు కూడా లేవు. ఈ కళాకారులను ప్రోత్సహించి ఈ కళను గ్రంథస్తం చేయవలసి యున్నది.